Friday, October 13, 2017

కరేబియన్ రాజు, పులుల కథ - మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారి పాలనా విధానం




కొన్ని సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కరేబియన్ దీవులలో ఒక పెద్ద అడవిలో ఒక రాజు ఉండేవాడట.. ఆరాజుకు చిరుతపులులను ,పెద్ద పులులను పెంచుకొనే అలవాటు ఉండేదట.. అలా పెంచుకున్న పులులకు రోజు కూడా వివిధ రకాల ఆహర పదార్థాలు పెట్టేవాడట, అలాకొన్ని రోజులు తన  జీవిత ప్రయాణ సాగుతుపోయింది.. ఒకానొక రోజు ఆ అడవిలో రాజుకు ఒక ఆలోచన వచ్చింది, అదేంటంటే తనకు ఉన్నటువంటి అలవాటు ..ఆ రాజుకు రోజు కూడా కొకైన్( మత్తు మందు)  తీసుకొనే అలవాటు ఉండేది..

అదే క్రమంలో తను పెంచుకోటున్న చిరుతపులులకు, పెద్దపులులకు ఒకానొక రోజు, రోజువారీగా పెట్టె ఆహార పదార్థాలకు బదులుగా ఒక రోజు తను తీసుకొనే కొకైన్( మత్తు మందు ) తో కపిలినా ఆహార పదార్థాలు, మరియు మరొక్క పక్కన రోజువారీ ఆహార పదార్థాలు పెట్టినడట.. ఆరోజు ఆ పులులు రోజువారీ ఆహారమును మొత్తం కూడా తినేసి ,పక్కనే మిగిలి ఉన్నకొకైన్ తో కలిపిన ఆహార పదార్థాలను కొంచం తిని వదిలిపెట్టినవట..


అలానే మరుసటిరోజు కూడా ఒక పక్కన రోజువారీ ఆహారం, మరో పక్కన కొకైన్ తో కలిపిన ఆహార పదార్థాలను పెట్టాడట ఆ రాజు గారు.. ఆరోజు ఆ పులులు రోజువారీ ఆహారం తినకుండా ,కొకైన్ తో కలిపిన ఆహార పదార్థాలను మాత్రమే తినేసి.. రోజువారీ ఆహార పదార్థాలను వదిలేసినవట...


ఇలా మూడో రోజు కూడా ఒక పక్కన రోజువారీ ఆహారం , మరోపక్కన కొకైన్ తో కలిపిన ఆహారం పెట్టాడట, ఆ రోజు కూడా రోజువారీ ఆహారం తినకుండా ,కొకైన్ తో కలిపిన ఆహారమును మాత్రమే తిన్నాయట ఆ పులులు...


ఇలానే రోజు కూడా  కొనసాగుతుందట..కొన్ని రోజుల తర్వాత ఆ రాజు గారు .. ఒక రోజు కొకైన్ తో కలిపిన ఆహారం పెట్టడం ఆపేశాడట..ఆరోజు ఆ పులులు ఆహారం తినకుండా అలానే ఉన్నాయట..రెండో రోజు కూడా కొకైన్ తో కలిపిన ఆహారం పెట్టలేదట.. ఆరోజు ఆ పులులు ఆకలితో ఉన్న కోపంలో మరియు కొకైన్ తో కలిగిన ఆహారం, ఆ రాజు గారు పెట్టలేదని కోపంతో ఆ రాజుగారి మీదనే దాడి చేశాయట.. ఆ దాడిలో ఆ రాజు గారు పూర్తిగా గాయపడినారట .. ఆ దాడి నుండి రాజు గారు  తప్పించుకొని భయంతో ఆ అడవి ప్రాంతాన్ని వదిలేసి పారిపోయారట....అక్కడే ఆ అడవిలో ఉన్న పులులు మాత్రం రోజు అలవాటు అయినా కొకైన్ తో కలిపిన ఆహారం దొరుకకా..కొన్ని రోజుల తర్వాత అన్ని పులులు కూడా చనిపోయాయట....

క్కడ మనం తెలుసుకోవాలిసిన నీతి సారాంశం :-

 పైన జరిగిన సంఘటను ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పైన మనం తెలుసుకొన్న విధంగానే ఉన్నాయి.

సీఎం కేసీఆర్ గారు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కోట్లాది రూపాయలు, చీరలు , వివిధ పథకాలు హామీలు ఇస్తున్నాడు..అది ఎలాగో నేను ఇక్కడ మీకు తెలుపుతాను...పైన జరిగిన సంఘటను మన ప్రభుత్వ విధి విధానాలతో పోల్చి మీకు వివరిస్తాను..


 ఇక్కడ ఆ కరేబియన్ రాజు అంటే = మన సీఎం కేసీఆర్ గారు

ఇక్కడ ఆ అడవిలో పులులు అంటే = తెలంగాణ ప్రజలు


రోజువారీ ఆహారం అంటే = మంచి ప్రభుత్వం పథకాలు

కొకైన్ (మత్తు మందు) తో కలిపిన ఆహారం అంటే = ప్రజల దృష్టిని ఆకర్షించే పథకాలు , వస్తువులు , నిధులు ( చీరలు దుబారా ఖర్చులు..ect )



ఆ కరేబియన్ రాజు ఎలాగాయితే ఆ పులులకు రోజువారీ ఆహార పదార్థాలు పెట్టకుండా, కొకైన్ తో కలిపిన మత్తు ఆహార పదార్థాలు పెట్టడం మొదలు పెట్టాడో.. అలానే తెలంగాణ రాష్ట్రములో సీఎం కేసీఆర్ గారు , ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చీరలు, దుబారా ఖర్చులు, కొన్ని పథకాలు ప్రజలకు అలవాటు చేస్తున్నాడు.....


అదేవిధంగాను ఆ కరేబియన్ రాజు , ఆ పులులకు మత్తు  కూడిన కొకైన్ ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల చివరకు ఆ పులులు రోజువారీ ఆహారం తినడం మానేసి , కేవలము మత్తుతో కూడిన ఆహార పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకొన్నవి.. చివరకు ఆ ఆహార పదార్థాలు ఇవ్వకపోవడం వల్లనే కరేబియన్ రాజు పైనే దాడి చేశాయి ఆ పులులు , అదేవిధంగా చివరకు ఆ పులులు కూడా ఆకలితో మరణించిన్నవి ..ఇక్కడ అలానే ఉన్నది పరిస్థితి తెలంగాణ రాష్ట్రలో సీఎం కేసీఆర్ గారు , ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వివిధ పథకాలు, దుబారా ఖర్చులు, చీరలు మరియు ఇలాంటివి ప్రజలకు అలవాటు చేయడం ద్వారా ఎదో రోజు ప్రజలు కూడా ప్రభుత్వం పై తిరగబడుతారు.. పైనా జరిగిన విధంగానే ఇక్కడ కూడా చివరకు ప్రజలు నష్టపోతారు... ప్రభుత్వం కూడా నష్టపోతోంది...

చివరగాను ఈ కథను కొన్ని కలిపిత కధలతో  రాయడం జరిగింది.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు  నష్టం జరగకుండా ఉండాలని మంచి ఉదేశ్యంతో రాయడం జరిగింది...దయచేసి ఇది మీరు గ్రహించగలరని కోరుకొంటున్నాను...



ఇట్లు
సురేందర్ తాళ్లపెళ్లి


No comments:

Post a Comment