Saturday, July 29, 2023

ప్రకృతి విపత్తు వర్షాలు, వరదలతో కూడా రాజకీయమా? వరద బాధిత ప్రజలకు సహాయం చేయండి ఆ తర్వాత మీ రాజకీయాలు చేయండి.

 పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పనులు చూస్తే, అచ్చం మహాభారతంలో పౌండ్రక వాసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి,

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చాయి. దీనికి సంబంధిత సాక్షాలు అందరి కండ్ల ముందు కనిపిస్తున్నాయి, ఒకవేళ కనిపించని వారు భారత వాతావరణ శాఖ దగ్గర వివరాలను తీసుకుని చూడవచ్చు.

సామాన్యంగా వరదలు, వర్షాలు వచ్చినప్పుడు నాయకులు చేయవలసిన పని, ప్రజలకు ధైర్యాన్ని కల్పించి, వారికి తోచిన స్థాయిలో ఆహారం, నిత్యవసర వస్తువులు కల్పించి వారికి తోడు నిలవాలి, అది నాయకుడి యొక్క ప్రథమ లక్షణం.

అంతేకానీ వర్షం వెలవగానే మొదటి రోజు నుండే ప్రభుత్వంపై ధర్నాలు చెయ్యడం ఏంటి?

ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పులేదు కానీ ఈ సమస్య ప్రభుత్వం ద్వారా జరగలేదు. ప్రకృతి విపత్తు నుండి జరిగింది, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ సమన్వయం వహించి, బాధిత ప్రజలకు తోడు నిలిచి, ప్రభుత్వం వరద అంచనా వేసిన తర్వాత. బాధితులకు సరియైన స్థాయిలో నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే, అప్పుడు ప్రభుత్వంపై బాధిత ప్రజల తరఫున పోరాడాలి, ధర్నాలు చేయాలి. ఇది ఒక పద్ధతి, ఇది మరిచి పోయి, అంగడి అంగడి ఆగమాగం చేస్తే ఎలా?

ఈ వర్షాల గురించి ఈ వరదల గురించి ప్రజలకు, గ్రామీణ ప్రజలకు సరియైన స్థాయిలో అవగాహన ఉంది, మీరు వరదలు వచ్చినా గ్రామాలలోకి వెళ్లి అడగండి. వారి చెప్పారు, ఇలాంటి వర్షాలు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చాయో,


ఇలాంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయి. 🙏😊మనం ప్రజల మనసులను దోచుకునే పనులు చేయాలి అంతేకానీ ప్రజలను గందరగోళంలోకి నెట్టకూడదు.

No comments:

Post a Comment