Sunday, August 24, 2025

యూరియా సమస్య - పరిష్కార మార్గాలు

రాష్ట్రంలో యూరియా కొరతపై ఇంత అలజడి జరుగుతున్నా, ప్రభుత్వం ఆ సమస్యను ఎందుకు నివారించలేకపోతుందో అర్థం కావడం లేదు. ఈ సమస్యకు గల కారణాలను, వాటి పరిష్కార మార్గాలను ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు. 

📍సరఫరాలో సమన్వయ లోపం: వాస్తవానికి, యూరియా సరఫరా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరుగుతుంది. బహుశా, ఈ సమస్య మొదటి అడుగులోనే మొదలైందని నేను భావిస్తున్నాను. సరఫరా వ్యవస్థలో సమన్వయం లేకపోవడం వల్లనే ఈ కొరత ఏర్పడి ఉండవచ్చు.

📍నల్లబజారు దందాపై నియంత్రణ లోపం: ఈ మధ్య వార్తాపత్రికల్లో చూసిన దాని ప్రకారం, నల్లబజారులో యూరియా అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలాంటి అక్రమార్కులపై ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. దీని వల్ల సాధారణ రైతులకు యూరియా అందుబాటులో ఉండటం లేదు.

📍దీర్ఘకాలిక సమస్య: యూరియా కొరత అనేది కొత్తగా వచ్చిన సమస్య కాదు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను నివారించడానికి ఎన్నో వ్యవస్థలు ఉన్నా, ప్రభుత్వాలు వాటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు.

📍నానో యూరియాపై అవగాహన కల్పించాలి: యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా అందుబాటులోకి వచ్చింది. దీన్ని రైతులకు సరఫరా చేసి, దాని వాడకంపై అవగాహన కల్పించవచ్చు. కానీ, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు ఈ దిశగా సరైన చర్యలు తీసుకోవడం లేదు.

📍రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి: యూరియా వాడకం వల్ల భూమి కలుషితమవుతుంది. దీన్ని తగ్గించడానికి క్రమంగా రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి. సేంద్రీయ ఎరువులను సొంతంగా తయారు చేసుకునేలా వారికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

📍సేంద్రీయ ఎరువులకు ప్రభుత్వ ప్రోత్సాహం: సేంద్రీయ ఎరువుల తయారీకి అవసరమైన ఆర్థిక సాయాన్ని, సబ్సిడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అందిస్తే కొంతమంది రైతులు ఈ మార్గాన్ని అనుసరించడానికి ముందుకు వస్తారు.  

📍సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం: సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటలకు మార్కెట్లో మంచి ధర ఉంటుంది. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పి, వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి తగిన మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తే, ఎక్కువ మంది రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టి, యూరియా వాడకాన్ని తగ్గించే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వ మద్దతు చాలా అవసరం.

చివరిగా

యూరియాకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి వాడకంపై రైతులకు అవగాహన కల్పించి, భవిష్యత్తులో యూరియా వాడకాన్ని గణనీయంగా తగ్గించాలి. లేకపోతే, భవిష్యత్తులో రైతులు తీవ్రంగా నష్టపోతారు. అలాగే, ఈ సమస్య ప్రభుత్వానికి కూడా నిరంతర ఇబ్బందిగా మిగిలిపోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించడం ఎంతైనా అవసరం.


Regards

Surender Thallapelly 


Telangana CMO Anumula Revanth Reddy Bhatti Vikramarka Mallu  Ponnam Prabhakar  Mahesh Goud Bomma

Friday, May 23, 2025

Setting up an iPhone manufacturing unit in India would primarily benefit Apple, with no significant advantage for #India

Setting up an iPhone manufacturing unit in India would primarily benefit Apple, with no significant advantage for #India

Despite India's population exceeding 1.4 billion, only 12 million people use iPhones. The remaining 90% of the population primarily uses Android mobile phones.

What we need to understand here is that if Apple were to set up a manufacturing unit in India, prices might decrease slightly. This could lead to an increase in iPhone users in India, ultimately bringing significant profit to Apple.


Even if this manufacturing unit isn't set up in India, there's no loss for India. However, if a manufacturing unit is established in India, Apple would have the opportunity to reach over 5 billion people in the Indian subcontinent and across Asia.


Apple needs to consider the benefits of setting up a manufacturing unit in the U.S. In terms of population, the U.S. has only 350 million people. The current policies of the U.S. government regarding production are well-known globally, and many countries are already confused by them. In such circumstances, setting up an Apple manufacturing unit in the U.S. could lead to losses for the company.


The U.S. is already at the forefront of iPhone usage. There's no benefit in setting up a manufacturing unit there. For Apple to expand its market, it's best to establish manufacturing units where usage is low and in locations where they can increase their customer base. The ideal place for this is the Asian continent, specifically its subcontinent, India!


ఐఫోన్ తయారీ యూనిట్‌ను భారతదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ఐఫోన్ కంపెనీకే లాభం తప్ప, భారతదేశానికి చెప్పుకోదగిన ప్రయోజనం ఏమీ ఉండదు

భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, కేవలం 1.2 కోట్ల మంది మాత్రమే ఐఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. మిగిలిన జనాభాలో 90 శాతం మంది ఆండ్రాయిడ్ మొబైల్స్‌నే వాడుతున్నారు.

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ యాపిల్ తయారీ యూనిట్‌ను భారతదేశంలో ఏర్పాటు చేస్తే, వాటి ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. తద్వారా భారతదేశంలో ఐఫోన్ వాడే వారి సంఖ్య పెరగవచ్చు. దీనివల్ల యాపిల్ కంపెనీకే భారీ లాభం చేకూరుతుంది.


ఈ తయారీ యూనిట్‌ను భారతదేశంలో పెట్టకపోయినా భారతదేశానికి ఎటువంటి నష్టం లేదు. అయితే, ఒకవేళ భారతదేశంలోనే తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లయితే, యాపిల్ కంపెనీకి భారత ఉపఖండంతో పాటు ఆసియా ఖండంలోని 500 కోట్లకు పైగా ఉన్న జనాభాకు చేరువయ్యే అవకాశం ఉంది.


అమెరికాలో యాపిల్ కంపెనీ తయారీ యూనిట్‌ను పెట్టడం వల్ల ఏం లాభమో యాపిల్ కంపెనీ ఆలోచించుకోవాలి. జనాభా పరంగా అమెరికా జనాభా కేవలం 35 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ఉత్పత్తుల విషయంలో అమెరికా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం ప్రపంచానికి తెలిసిందే. 


ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటికే అయోమయంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాపిల్ కంపెనీ తయారీ యూనిట్‌ను అమెరికాలో పెట్టడం వల్ల ఆ కంపెనీకే నష్టం జరగవచ్చు.


ఇప్పటికే ఐఫోన్ వాడకంలో అమెరికానే ముందుంది. తయారీ యూనిట్‌ను అమెరికాలో పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. 


యాపిల్ ఫోన్ మార్కెటింగ్‌ను విస్తరించాలంటే, వాడకం తక్కువగా ఉన్నచోట తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి, వినియోగదారులను పెంచుకునే ప్రదేశాల్లో పెట్టడం ఉత్తమం. దానికి సరైన వేదిక ఆసియా ఖండం, దానిలో ఉపఖండమైన భారతదేశం మాత్రమే!


#apple #iphone #India #indiaiphone


Regards 

Surender Thallapelly 

Friday, May 9, 2025

వీలైతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలు వారి కార్యకర్తలకు ప్రస్తుత మరియు భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై అవగాహన కల్పించి, దేశ ప్రజలకు రక్షణగా ఉండేలా చూడండి

 యుద్ధం జరుగుతున్న సమయంలో మన సైనిక బలగాలకు మరియు ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలు ఉంటాయి. ఏ రహస్యాలు, ఏ వార్తలు ఏ సమయంలో బహిర్గతం చేయాలో వారికి బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే వాటి ద్వారా జరిగే లాభనష్టాల గురించి వారికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ప్రజలుగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.



ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది వ్యక్తులు రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలను కూడా సోషల్ మీడియా వేదికల్లో, టీవీలలో బహిర్గతం చేస్తున్నారు.


వారి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. మీరు ఆ విషయాన్ని ముందుగా తెలుసుకొని అందరికీ తెలియజేయాలనుకున్నారు. కానీ అది శత్రువులకు ఆయుధంగా మారవచ్చు. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి!


మరి కొంతమంది వ్యక్తులైతే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో వారి వ్యక్తిగత ఆలోచనలను ప్రజల మీద రుద్దుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు!


దయచేసి ప్రస్తుతం రాజకీయ పార్టీల వ్యక్తిగత ఆలోచనలను పక్కనపెట్టి, ఒక భారతీయ పౌరుడిగా మన దేశానికి, మన రక్షణ వ్యవస్థకు ఏమి చేయగలమని ఆలోచించండి మరియు సహాయ సహకారాలు అందించండి!


వీలైతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల అధినేతలు వారి కార్యకర్తలకు ప్రస్తుత మరియు భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో అనుసరించవలసిన వ్యూహాలపై అవగాహన కల్పించి, దేశ ప్రజలకు రక్షణగా ఉండేలా చూడండి!


మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడే మన శత్రువును ఓడించగలం!


జై హింద్! జై భారత్! 🇮🇳✊


Cc :Telangana CMO Anumula Revanth Reddy Kalvakuntla Taraka Rama Rao - KTR Mahesh Goud Bomma Kishan Reddy Gangapuram Bandi Sanjay Kumar Ponnam Prabhakar Dr Sravan Dasoju

Tuesday, April 29, 2025

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవ్వడానికి కారణం ఆ సంస్థలే

ఈ మధ్య కొంతమంది భూముల ధరలు తగ్గడానికి మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ, ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కాదు.

దీనికి ప్రధాన కారణం కేవలం రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులు మరియు సంస్థలు మాత్రమే. వారు తీసుకున్న నిర్ణయాలు మరియు విపరీతంగా పెంచిన ధరలే నేడు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడానికి కారణమని నేను భావిస్తున్నాను.


ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొనాలంటే 25 లక్షల నుండి 45 లక్షల లోపు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధరలు అమాంతం 75 లక్షల నుండి 90 లక్షలకు పెరిగాయి. 


ఇక త్రీ బిహెచ్కె ప్లాట్ లేదా హౌస్ విషయానికి వస్తే, ఒకప్పుడు దాని ధర 50 నుండి 60 లక్షల లోపు ఉండేది. కానీ ఇప్పుడు దాని విలువ ఏకంగా కోటి రూపాయలకు పైగా పెరిగింది.


విల్లా లేదా ఇండిపెండెంట్ హౌస్ల గురించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు విల్లా కొనాలంటే 60 లేదా 70 లక్షల లోపు వచ్చేది, బాగా డబ్బున్నవారు కొంటే 80 లక్షల లోపు ఉండేది. కానీ ఇప్పుడు వాటి ధర మూడు నుండి నాలుగు కోట్లు పలుకుతోంది.


మరికొన్ని అత్యంత ఖరీదైన విల్లాల గురించి చెప్పనక్కర్లేదు, వాటి అమ్మకాలు ఏకంగా 35 కోట్లకు పైగా జరుగుతున్నాయి.


అంతగా ధరలు పెంచితే సామాన్య ప్రజలు ఎలా కొంటారు? ధరల పెరుగుదల అనేది ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ఉండాలి కదా. సామాన్య మరియు పేద ప్రజలకు డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? అన్ని లక్షల కోట్లు ఖర్చు చేసి వారు ఎలా కొనగలరు? 


బెంగళూరులోనో, ఢిల్లీలోనో ధరలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ కూడా పెంచితే ఎలా? ఇక్కడి ప్రాంత ప్రజల స్థితిగతులు మరియు ఆర్థిక పరిస్థితులను బట్టి కదా ధరలు పెంచాలి?


అందుకేనేమో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కుదేలవుతోంది!


గ్రామాల విషయానికి వస్తే భూముల ధరలు పెరగడం నిజమే. ప్రస్తుతం ఆ ధరలు కొంచెం అటూ ఇటూగా ఉన్నప్పటికీ, వాటిని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంతో పోల్చలేము.


ఈ ధరల నియంత్రణను అడ్డుకోవడంలో గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం రెండూ విఫలమయ్యాయి మరియు అవుతున్నాయి.


మీరు నిజంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే, రియల్ ఎస్టేట్ సంస్థలతో మరియు ఏజెంట్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ధరల నియంత్రణ చర్యలు చేపట్టండి! 


ఆ తర్వాతనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక సరైన మార్గంలోకి వస్తుంది, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది! 


ఈ చర్యలు చేపట్టకపోతే అటు రియల్ ఎస్టేట్ రంగం, ఇటు ప్రభుత్వం రెండూ నష్టపోతాయి. 


ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.🙏


Regards 

Surender Thallapelly 


Cc :Telangana CMO Bhatti Vikramarka Mallu Ponnam Prabhakar Mahesh Goud Bomma Kalvakuntla Taraka Rama Rao - KTR

Saturday, March 15, 2025

తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఎంపికైన తర్వాత డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్న గారిని వెళ్లి కలవడం జరిగింది !

 తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఎంపికైన తర్వాత డాక్టర్ శ్రవణ్ దాసోజు అన్న గారిని వెళ్లి కలవడం జరిగింది !



శ్రవణ్ అన్న రాజకీయ ప్రస్థానంలో, వారికి తోడుగా, వారి వెంటనడిచిన నడిచిన ప్రయాణంలో కొన్ని గుర్తులు..


తెలంగాణ ఉద్యమ అధినాయకులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగాలతో ప్రేరణ పొంది, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమకారుడిగా అడుగులు వేసి నా వంతు పాత్ర పోషించాను..



ఆ తదననంతరం, ఒక తెలంగాణ బిడ్డగా, నేటి రాజకీయాల్లో నా తరఫునుండి ఈ సమాజంలో ఏదో ఒక మార్పు చేయాలని ఒక దృఢ సంకల్పంతో...శ్రవణ్ అన్న గారితో కలిసి 2014లో ప్రయాణం మొదలుపెట్టడం ప్రారంభించాను..వారు చేసే ప్రతి పనిలో మమ్ములను భాగం చేస్తూ, మాకు దిశా నిర్దేశం ఇచ్చేవారు, కేవలం రాజకీయ అంశాలే కాకుండా..నిజ జీవితంలో జరిగే కష్టనష్టాలను కూడా ఎలా తట్టుకోవాలో వాటిని ఎలా ఎదుర్కోవాలో నిర్దేశించేవాడు..



శ్రవణ్ అన్న గారు నేటి సమాజ మార్పు కోసం,పేద ప్రజల బాగు కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి ప్రగతి కోసం, వారు పడిన తపన, పోరాట స్ఫూర్తి, వ్యక్తిగత  జీవితాన్ని వదులుకొని ఎన్నో రాత్రి పగలు పరితపించిన క్షణాలకు నేను ఒక సాక్షిని .


వారితో ప్రయాణించే సమయంలో నేను ఎక్కువగా వారి వద్ద నుంచి గమనించిన కొన్ని విషయాలు..


ఒక ఉన్నతంగా చదువుకున్న వ్యక్తిగా ఈ సమాజ మార్పు కోసం ,పేద ప్రజల జీవితాల బాగు కోసం..ఏదో ఒక గొప్ప మార్పు చేసి వారి జీవితాలను మార్చాలని తపన వారిలో ఎప్పుడూ కనపడేది.


వారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమము అయిపోయేంత వరకి ఆ పనిలో నిమగ్నం అయ్యేవారు..ఆ సమయంలో వారు రాత్రి పగళ్లు కూడా మరిచిపోయి పనిచేసే వారు మమ్ములను అదేవిధంగా ప్రేరేపించేవారు.


ఎప్పుడైనా ఈ సమాజాన్ని ఉద్దేశించి ఏదైనా చెప్పాలనుకున్న సమయంలో, ఆ సమస్య గురించి  క్షుణ్ణంగా పరిశోధించి, పరిశీలించి..ఆ సమస్య పరిష్కారంలో ఎక్స్పర్ట్ అయిన వ్యక్తులను సంప్రదించి వారితో చర్చించిన ఆ తర్వాతే వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని మీడియా సాధనాలతో ప్రజలకు వ్యక్తపరిచేవాడు..


వారు రాజకీయాలలో ఏ కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమం చేయాలనుకున్నా రాజకీయ పరిశుభ్రత పాటించాలి అనుకునేవాడు..


వారి జీవితంలో దైవ నిర్ణయంతో కొన్ని అనుకోని సంఘటనలు జరిగినా, చివరికి ఉద్యమ అధినాయకులు పెద్దలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెడుతున్నారు..


శ్రవణ్ అన్న గారి జీవిత ప్రయాణంలో వారు పడిన ఆటుపోటులు, నేటి యువతరానికి ఎంతో అవసరం, మరీ ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి ఈ సమాజాన్ని మార్చాలని అనుకునే యువతరానికి ఎంతో గాను అవసరం..


చివరగా ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో, పెద్దలు కేసీఆర్ గారి అండదండలతో..మీరు ఒక శాసనమండలి ప్రతినిధిగా ఒక ఎమ్మెల్సీగా..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పూలే గారి ఆశయాలతో..బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం ప్రగతి కోసం పోరాడాలని..నేటి రాజకీయాల్లో రావాలనుకునే యువతరానికి..మీరు పడిన ఆటుపోటులను వివరిస్తూ,నేటి సమాజ మార్పు కోసం ఉన్నతమైన యువకులను తయారు చేసే శక్తి మీకు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ మీరు ఎల్లవేళలా శక్తివంతులుగా ఉండాలని కోరుకునే మీ తమ్ముడు సురేందర్..🙏💐

Monday, February 17, 2025

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే నాయకులే అంటున్నారు,బూతులే మా ఆయుధాలు,మా రక్షణ కవచాలు,మా రాజకీయ పదవులకు పునాదులు..రేపటి భవిష్యత్తుకు బలాలు అంటున్నారు!

 

"బూతులే బంగారు బాతులు" అనే వార్త ఆంధ్రజ్యోతిలో చదివాను,ఇలాంటి వార్త రాయడం అభినందించే విషయము..


మీరు రాసిన వార్త నూటికి నూరు శాతం నిజమే,ఈ విషయం మీద చాలా లోతుగా చర్చ జరగాలి!


కేవలం యూట్యూబ్ ఛానల్ లే కాదు,కొన్ని వార్తాపత్రికలు వార్తా ప్రసార మాధ్యమాలు కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నాయి..


కొందరు బూతులతో డబ్బులు సంపాదిస్తుంటే,మరికొందరు అబద్దాల వార్తలు నిజాలుగా రాసి కోట్లు సంపాదిస్తున్నారు,ఇది అందరికీ తెలిసిన విషయమే దీని లోతులోకి పోదలుచుకోలేను!


ఈ వార్త లోకి వస్తే, ఈ మధ్య ఒక పుస్తక విడుదల కార్యక్రమాల్లో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడారు..బూతులు మాట్లాడడం తప్పే గాని అంటూ..బూతులు మాట్లాడలేకపోతే నేను రాజకీయాలు చేయలేను నా రాజకీయ జీవిత ఆట ఆడలేను అని మాట్లాడారు..!


నాకు తెలిసి ఇది అతి పెద్ద ప్రకటన రాజ్యాంగ పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడారు అంటే,అది చాలా పెద్ద విషయం,కానీ ఆ వార్త గురించి మరుసటి రోజు ఏ పత్రిక కూడా ప్రచురించలేదు!


అఫ్కోస్ ముఖ్యమంత్రి గారు అన్న విషయంలో అర్థం ఉంది,బూతు మాటలతో మాట్లాడకపోతే ప్రజలకి నా మాటలు ఎక్కవు నన్ను ఆదరించరు అనే విధంగా మాట్లాడారు తను..


బహుశా ప్రస్తుత యూట్యూబర్లు కూడా ఇవే దారిని అనుసరిస్తున్నారేమో,ఇక్కడ తప్పు ముఖ్యమంత్రి గారితో యూట్యూబర్లదో కాదు..


నూటికి నూరుపార్లు ప్రజలదే తప్పు అవుతుంది, ఒక నాయకుడు, ఒక యూట్యూబర్ఓ లేదంటే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వ్యక్తి బూతులతో మాట్లాడినప్పుడు  లేదా పోస్ట్ పెట్టినప్పుడు..వారి వార్తలను వారి పోస్టులను ఆదరించినంత విధంగా. బూతులు లేకుండా అర్థవంతంగా రాసిన పోస్టులకు కానీ వీడియోలకు కానీ మాట్లాడిన మాటలకు కానీ ఈరోజు ప్రజలు పట్టించుకోవడం లేదు..


రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే నాయకులే అంటున్నారు,బూతులే మా ఆయుధాలు,మా రక్షణ కవచాలు,మా రాజకీయ పదవులకు పునాదులు..రేపటి భవిష్యత్తుకు బలాలు అంటున్నారు!


ఇక ఎలా మార్పు వస్తుంది, మనం ఈ మార్పుని ఎలా ఆశించాలి?


✍️మీ సురేందర్ తాళ్ళపల్లి.

Tuesday, November 12, 2024

సమస్య రైతుల భూముల లేదా ప్రతిపక్ష నాయకుల?మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ రైతులకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయండి.

 వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం,ప్రభుత్వంలో ఎవరు ఉన్న రైతుల విషయంలో ప్రతిసారి జరిగేది అన్యాయమే,అభివృద్ధి పేరుతో అమాయక రైతుల భూములను లాక్కొని, కనీసం వారి భూములకి, భూ సేకరణ చట్టం ద్వారా ఇవ్వవలసిన నష్టపరియారాన్ని ఇవ్వకుండా,రైతుల వ్యక్తిగత అభిప్రాయాలను సరిగ్గా తీసుకోకుండా,తెలుసుకోకుండా..రైతుల మధ్యకు పోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి,ఇలాంటి సంఘటనలే గతంలో కూడా మనం చూసాం,అప్పుడు ఆ రైతులకు మద్దతుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు అప్పటి రాష్ట్రపతి గారికి లేఖలు రాశారు స్వయాన వెళ్లి కలిసారు కూడా, కొంతమంది ఇప్పటి మంత్రులు అయితే స్వయాన రైతుల తరపున కోర్టులో పోరాటాలు కూడా చేశారు.



నాకు ఇదే అర్థం కావడం లేదు,ప్రభుత్వాలు మారగానే ఆ ప్రభుత్వంలోకి మనం రాగానే ఎందుకు ఆ చట్టాలను ఆ పోరాటాలను మరిచిపోతాము,


ఆ రైతులు అడిగేది వారి పొలాలకు వారి భూములకు సరి అయిన పరిహారం ఇవ్వాలనే కదా మిమ్ములను అడిగేది,ఎందుకు వారికి ఇతర పార్టీలతో సంబంధాలు ఉన్నాయని బదనాం చేస్తున్నారు, ఒకవేళ ఉంటే తప్పేంటి..గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా,సమస్య ఉన్న రైతులు ప్రతిపక్షాల దగ్గరికి వచ్చే కదా వారి బాధలను పంచుకున్నారు..అలా వచ్చిన రైతులను ఆరోజు ప్రభుత్వం కూడా అలానే బదనాం చేసింది!


నాకు ఇక్కడ అర్థం కాని విషయం,అక్కడ రైతుల సమస్య స్పష్టంగా కనబడుతుంది.అలాంటప్పుడు ఆ రైతులని ప్రభుత్వ అధికారులతో మంత్రులు ముఖ్యమంత్రులు వెళ్లి ఎందుకు కలవలేదు,వారి సమస్యలను ఎందుకు తెలుసుకోలేకపోయారు?


చివరికి కొంతమంది అధికారులను పంపి,రైతులను భయాందోళనకు గురిచేసి,ఆ రైతులు ఆవేశంతో కోపంతో ఆ అధికారుల మీద తిరగబడే విధంగా ఎందుకు ఈ దుస్థితికి తీసుకొచ్చారు?


ఇక్కడ తప్పు అధికారులది కాదు రైతులది కాదు,రైతులు చెప్పే కారణాలు సమస్యలు తెలుసుకోకుండా ఆ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి ఆలోచన చేసిన ప్రభుత్వాందే అవుతుంది!


దయచేసి ఈ విషయంలో ప్రభుత్వము మరోసారి ఆలోచన చేసి ఆ రైతులకి భూసేకరణ చట్టం ద్వారా పరిహారాన్ని చెల్లించి,ఆ రైతులకు న్యాయం చేసి..అభివృద్ధి కార్యక్రమానికి అడుగులు వేయండి🙏 


అంతేకానీ వారి భూములను కోల్పోతున్నామని ఆవేశంలో దాడులు చేసిన రైతులని జైల్లో పెడితే ఏమి లాభం ఉండదు, ఆ సంఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అలాంటి సంఘటనలు జరగవద్దు అని కోరుకుందాం👍..


CC: Telangana CMO Anumula Revanth Reddy Ponnam Prabhakar Mahesh Goud Bomma Prabhakar Ponnam Bandi Sanjay Kumar Kalvakuntla Taraka Rama Rao - KTR Dr Sravan Dasoju Rahul Gandhi Telangana Congress Uttam Kumar Reddy