కొంతమంది మిత్రులు గమ్మతిగా విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని
విమర్శ :ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకి కలిసే అవకాశం ఇవ్వరు, ఎవ్వరికి అందుబాటులో ఉండరు అని, అలాగే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు అని.
వారికి నా సమాధానం :
మీరు చెప్పింది నిజమే రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఇలా జరిగేది. నాకు బాగా గుర్తు, కానీ మీకు ఎంతవరకు అవగాహన ఉందో లేదో నాకు తెలవదు.
ఆ సమయంలో వారిని కలిసిన సామాన్యుల, వారి సమస్యలు ఏంటో మీకు తెలుసా కనీసం, ఆ రోజుల్లో 200, 250రూపాయల పింఛన్ ఇస్తే, పింఛన్ డబ్బులు కూడా రాకపోయేవి. పింఛన్ అప్లై చేసుకుంటే అప్లై కూడా కాక పోయేది. వాటికి కూడా లంచాలు అడిగే వారు వాటిపై విన్నపం ఇవ్వడం కోసము వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి కోసం వచ్చేవారు,
రెండోది ఆ కాలంలో రైతులకు విపరీతమైన కరెంటు సమస్య ఉండేది కరెంటు వస్తే కరెంటు మోటర్లు విపరీతంగా కాలేవి, నూతన వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే ఇంజనీర్లకు లంచాలు ఇచ్చే అంతవరకు వచ్చేవి కావు, వాటి కోసం రైతులు తలా ఇంత పైసలు వేసుకుని వారికి ఇచ్చేవారు. అలాంటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి కోసం వెళ్లేవారు.
ఇక మంచినీళ్ల సమస్యలు, నీళ్ల కోసం ఆడవాళ్లు బిందెలు పట్టుకొని బాయిల దగ్గరికి కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు తెచ్చుకునేవారు. అలాగే ఒకవేళ అందుబాటులో ఉన్న కొళాయిలు ఉంటే వాటి ముందు వందల కొద్ది మహిళలు బిందెలు పట్టుకొని ఉండేవారు,ఆ కుళాయిల నుండి మంచినీళ్లు వచ్చేది కాదు, ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఆ రోజు ముఖ్యమంత్రిని కలిసేవారు.
ఇక ఇలాంటి లెక్కలు ఎన్నో ఉండేవి. ఇలాంటి సమస్యలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి?
ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తున్నాయి. సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు, వారిని వ్యక్తిగతంగా కలుస్తూనే ఉన్నారు అధికారులతోటి ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ల ద్వారా ప్రజలకు దగ్గర అవుతూనే ఉన్నారు, ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇవన్నీ గమనించకుండా విష ప్రచారం చేయడం సరి అయింది కాదు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ ఇది అందరికి తెలిసిందే 60 ఏళ్ల పాలనలో ఏం చేసిందో అందరికీ కూడా తెలుసు, మీరు 9 ఏళ్ల పాలనను 60 ఏళ్ల పాలనతో పోల్చుతున్నారు, కానీ ప్రస్తుతం 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలో జరిగింది ఆ లెక్కలు ఒకసారి చూడండి.
ఆలోచించి ఓటు వేయండి, ఆవేశంతో కాదు.
మీ మిత్రుడు
సురేందర్ తాళ్ళపల్లి
No comments:
Post a Comment